Monday 26 January, 2009

దొంగల రాజ్యం

జర్నలిస్టుల్లో చాలా మంది దొంగలు ఉన్నారన్నది ప్రత్యేకించి చెప్పాలిందేమీ కాదు గానీ, ఇక్కడ ప్రస్తావించక తప్పదు.

Sunday 25 January, 2009

నల్గొండ వార్త విలేఖరి అవినీతి బాగోతం!

నల్గొండ వార్త విలేఖరిపై అనేక ఆరోపణలు వచ్చినా యాజమాన్యం దృష్టిలో వాడు మంచి బాలుడిగా నటిస్తుండటం వల్ల చర్యలు శూన్యమన్న ప్రచారం వినిపిస్తోంది. తెలుగు మహిళా నాయకురాలితో ఈ వెధవ పెట్టుకున్న అక్రమ సంబంధం బయటపడితే గానీ వీడి బాగోతం వెలుగుచూడదన్నది తోటి జర్నలిస్టుల అభిమతం. సబ్ ఎడిటర్తో వీడికి ఉన్న లింకులు కూడా ఒకటొకటిగా వెలుగుచూస్తున్నాయి.

శ్రీకాకుళం ఆంధ్రభూమి విలేఖరి అక్రమార్జన!

శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో ఆంధ్రభూమి విలేఖరిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు అవినీతి, అక్రమార్జనపై సంపూర్ణ సమాచారం, సమగ్ర ఆధారాలతో వచ్చే వారం ప్రత్యేక కథనం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎ.ఎన్.ఎం.ని గర్భవతిని చేసిన ఆంధ్రప్రభ విలేఖరి

విజయనగరం: జిల్లాలోని పార్వతీపురం డివిజన్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్త (ఎ.ఎన్.ఎం.)ను తన మాయ మాటలతో లొంగదీసుకుని చివరకు గర్భవతిని చేసిన ఆంధ్రప్రభ విలేఖరి దురాగతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఏడాదిలో మూడు అబార్షన్లు చేయించిన పోటుగాడి ఉదంతంపై ప్రత్యేక కథనం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విజయవాడలో రౌడీ జర్నలిస్టులు!

విజయవాడ: ఈ నగరం రౌడీలకు నిలయమనేది మనవాళ్లందరికీ తెలిసిందే। కానీ, ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు విలేఖర్లు కూడా రౌడీలుగా ప్రవర్తిస్తూ మండల విలేఖరులను దోచుకుంటున్న వైనమిది. వీళ్లిద్దరూ పేరుకే పెద్ద పత్రికల స్టాఫ్ రిపోర్టర్లు కానీ, ప్రవర్తన తీరు మాత్రం వీధి రౌడీలను తలపిస్తోంది.

విశాఖలో "దీన"పత్రికల హోరు!

పత్రికా ప్రచురణ రంగంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద ప్రచురణ కేంద్రంగా విరాజిల్లుతూ వస్తున్న విశాఖలో ఇప్పుడు "దీన"పత్రికల హోరు మొదలయింది. ఇంత వరకూ వార పత్రికగానో, పక్షపత్రిక గానో లేక మాస పత్రిక గానో ప్రచురితమవుతున్న పత్రికలన్నీ దినపత్రికల అవతారం ఎత్తుతున్నాయి. ఇప్పుడు ఉన్న పిరియాడిసిటీనే సక్రమంగా కొనసాగించలేక, యాడ్ వచ్చినప్పుడో లేక మరేదో ఆదాయం వచ్చినప్పుడో అరాకొరాగా చాలీచాలని పేజీలు వేస్తూ నెట్టుకు వస్తున్న వారంతా తమ పత్రికలను ఉన్నట్టుండి డైలీలుగా ఎందుకు మారుస్తున్నారో ఇప్పటికే మీకు అర్ధమై ఉండాలి.

ఉత్తరాంధ్రలో నకిలీ జర్నలిస్టులు

ఏ పత్రికలోనూ పని చేయకుండా జర్నలిస్టులగా చలామణీ అవుతూ అక్రమార్జనకు పాల్పడుతున్న నకిలీల సంఖ్య ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలలోనూ పెరుగుతోంది. "ఆపరేషన్ గజ" అంటూ ఇక్కడి అసలైన జర్నలిస్టులు ముద్దుగా పిలుచుకునే నకిలీలపై ప్రత్యేక కథనం...

ఈనాడు చంద్రశేఖర్ అక్రమార్జన

ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతికి పలానా పత్రిక రిపోర్టరని లేదు. యాజమాన్యం ఎంత కఠినంగా ఉన్నా వాటిల్లో పనిచేస్తూ సంపాదించడం మొదలుపెట్టిన వాడు తన నైజాన్ని మార్చుకోలేడనడానికి ఈనాడు చంద్రశేఖరే నిదర్శనం. డాబాగార్డెన్స్ డేట్ లైన్ పై వార్తలు రాసుకుని నెలకు వెయ్యో, పదిహేను వందలో సంపాదించుకునే వాడు ఉన్నట్టుండి లక్షలు ఎలా ఆర్జించాడన్నదాని గురించి యాజమాన్యం ఎందుకు ఆరా తీయడం లేదన్నది పక్కన పెడితే, విశాఖలో ఇటీవల వీడి ఆగడాలకు హద్దులేకుండాపోయింది. గత కొద్ది మాసాల నుండి కార్పోరేషన్ బీటు కూడా వెలగబెడుతున్న బినామీ సంపాదన (బి.ఎస్.) చంద్రశేఖర్ రెండు పెద్ద కేసుల్లో జి.వి.ఎం.సి. సిటీ ప్లానర్ రఘును ఇరికించే ప్రయత్నం కూడా చేశాడు. చివరికి విషయం మిగతా విలేఖరులకూ పొక్కడంతో అనుకున్న "ఫిగర్" తగ్గి వుండవచ్చుగానీ, ఆ రెండు కేసుల్లోనూ వీడి సంపాదన మూడు లక్షల రూపాయలంటే నమ్మశక్యం కాదు. తొక్కలో కెమేరా ఒకటి మొలలో పెట్టుకుని తనో కలం పోటుగాడిలా విర్రవీగిపోయే చంద్రశేఖర్ హవా జి.వి.ఎం.సి.లో బాగానే పనిచేస్తుంది. ఇ.ఇ.ల నుండి నెల మామూళ్లే కాకుండా టౌన్ ప్లానింగ్ విభాగం నుండి కేసుల వారీ ముడుపులు అందుకునే బి.ఎస్. గాడి బాగోతం ఈమధ్య ఈనాడు కాంపౌండ్లో కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో సీతంపేట డేట్ లైన్ పై రాస్తూ కార్పోరేషన్ బీటు చూసి అక్రమార్జనలో యాజమాన్యానికి పట్టుబడి పని పోగొట్టుకున్న ప్రసాద్ కన్నా దారుణంగా తయారైన బి.ఎస్.పై అవినీతి ఆరోపణలు ఇన్నీ అన్నీ కావు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకునిగా, మతప్రచారకుడుకె.ఎ.పాల్ ప్రెస్ మీట్ లలో డబ్బులు పంపిణీ చేసే మధ్యవర్తిగా, కార్పొరేషన్లో సెటిల్మెంట్లు చేసే బ్రోకర్ గా వీడు అనేక పాత్రల్లో జీవిస్తున్నా ఈనాడు స్ఠానిక నిర్వాహకులు పట్టించుకోకపోవడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. వీడు డెస్క్ లో వాళ్లని మేనేజ్ చేస్తున్నట్టు బయట ప్రచారం కూడా జరుగుతోంది. నిప్పులేనిదే పొగరాదన్నట్టు ఈ ప్రచారంలో ఎంతోకొంత నిజం లేకుండా పోదుకదా? సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుని హోదాలో వీడు అమ్మాయిలను తన సొంత అవసరాలకు వాడుకుంటుంటాడని వీడి వ్యతిరేక వర్గం చెబుతుంటుంది.
(వీడి అక్రమార్జనపై సమగ్ర ఆధారాలతో కూడిన వ్యాసం కోసం తరువాయి అప్ డేట్ కోసం వేచి చూడండి. అదే విధంగా వీడి గురించి గాని, వీడిలాంటి బ్రోకర్ జర్నలిస్టుల గురించి గానీ మీకు తెలిసిన వివరాలను మా ఇ-మెయిల్ కు పంపడం గాని, లేదా ఐటం కింద కామెంట్ రూపంలో జోడించడం గానీ చేయడం మరవకండి.)

"టివి-9" పేరిట వర్తకులకు వేధింపులు

తిరుమలేశుని సన్నిధిలో "టివి-9" పేరిట వర్తకులకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఇలాంటి ఆరోపణలు గతంలో అన్ని మీడియా సంస్ధల ప్రతినిధులపైనా వచ్చినప్పటికీ, ఈమధ్య కాలంలో ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై, అందునా "టివి-9" ప్రతినిధులపై ఎక్కువగా వస్తుండడం గమనార్హం.

దీని వెనుక ఏదో కుట్ర జరుగుతుందని ఆ సంస్ధ యాజమాన్యం అనవచ్చేమో కానీ ఇందులో ఎలాంటి విమర్శలకూ తావులేదు. దీనికి నిదర్శనం ఈ ఆదివారం జరిగిన సంఘటనే! తిరుమల కొండపై హోల్సేల్ వ్యాపారం చేస్తూ పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్న తమిళనాడుకు చెందిన వర్తకున్ని బ్లాక్ మెయిల్ చేసి యాభై వేల రూపాయలు డిమాండ్ చేసిన విషయం "టివి-9" యాజమాన్యం ద్రుష్టికి వచ్చిందో లేదో కానీ తిరుమల, తిరుపతంతా ఈ విషయం గుప్పుమంది. దీంతో ఎన్నాళ్లగానో సాగుతున్న మీడియా లంచాల బాగోతం మరోమారు బయటపడినట్లైంది.

వరంగల్ "వార్త" విలేఖరి అవినీతి బాగోతం!

వరంగల్ "వార్త" విలేఖరి అవినీతి బాగోతంపై ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈమధ్య వీడు రాసిన ఒక వార్తను చూపించి జిల్లా స్ఠాయి రాజకీయ నాయకుని వద్ద నుంచి ఇరవై వేల రూపాయలు గుంజుకున్న వైనం వెలుగు చూడ్డంతో ఈ ప్రముఖ పాత్రికేయుని చరిత్ర బయటపడింది. రెండు నెలల క్రితం ఇతగాడు వరంగల్ నగర కాంగ్రెస్ పార్టీ నాయకున్ని బెదిరించి పాతిక వేలు తీసుకున్న విషయం కూడా వెలుగులోకి రావడంతో ఆయన గారికి ఏం చేయాలో పాలుపోవడం లేదట!

గతంలో కూడా ఈయనపై పలు ఆరోపణలు వచ్చినా యాజమాన్యం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలన్నది కాదు విషయం, ఆయన వల్ల ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారన్నది గమనించాల్సి ఉంది. ఇతగాడి సంపాదన పిచ్చి ఎంతమందిని బలిచేస్తుందన్నది ఒక సారి పరిశీలించాల్సిన బాధ్యత యాజమాన్యంపై లేదా? అన్న అనుమానాలు వ్యాప్తి చెందక ముందే యాజమాన్యం అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మేలని తోటి మిత్రుల అభిప్రాయం.

నిజాలు రాసే జర్నలిస్టులకి ఆహ్వానం

సరైన ఆధారాలతో, సమగ్ర సమాచారంతో ఈ బ్లాగ్కి ఎవరైనా వార్తలు రాయొచ్చు. రాయడానికి వేదిక దొరికింది కదాని దయచేసి ఏదిపడితే అది రాసి పంపవద్దు. మీరు రాసే ఐటంలో విషయం ఉంటే దాన్ని తప్పకుండా బ్లాగ్లో పబ్లిష్ చేస్తాం. ఈ బ్లాగ్ని నడుపుతున్న ఉద్దేశం జర్నలిస్టుల్ని సరిదిద్దాలనే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని పాఠకులు గమనించ ప్రార్ధన.

ఎడిటర్,
మీడియా డైరీ,
సూర్యారావుపేట,
విజయవాడ-2

విశాఖ ఏజెన్సీలో స్మగ్లర్లకు "వార్త" విలేఖరి అండ

నర్సీపట్నం కేంద్రంగా పనిచేస్తున్న "వార్త" విలేఖరిపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జర్నలిజం ముసుగులో ఎర్నలిజానికి అలవాటుపడిన వీడి భాగోతం ఇటీవల ఏజెన్సీలో చర్చనీయాంశంగా మారింది. స్మగ్లర్లకు అండగా నిలుస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీడిపై ఇప్పటికే నాలుగైదు ఫిర్యాదులు "వార్త" కార్యాలయానికి వెళ్లినప్పటికీ వాటి గురించి పట్టించుకున్నవాడు లేకుండాపోయాడట. వీడి అవినీతిలో భాగం పంచుకుంటున్నట్టు కొంతమందిపై విమర్శలు కూడా వచ్చాయి. గత నెల చింతపల్లి నుంచి నర్సీపట్నం మీదుగా తరలిపోయిన సుమారు అర కోటి విలువైన గంజాయిని ఎక్సైజ్ కళ్లుగప్పి ఉంచేందుకు వీడు ఏకంగా ఐదు లక్షల రూపాయలు తీసుకున్న విషయం ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో హాట్ టాఫిక్ గా మారింది. గతంలో కూడా వీడిపై ఇదే తరహా ఆరోపణలు వచ్చిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. జర్నలిస్టుల సంఘం నాయకునిగా వీడు పాల్పడుతున్న అక్రమాలకు ఇక అడ్డేలేదు. జర్నలిజం ముసుగులోనే తన సొంత వ్యాపారాన్ని కూడా చాపకింద నీరులా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న వీడిపై స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుండి గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి వరకూ ఏ ఒక్కరికీ విశ్వాసం లేదు. లోకల్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నుండి ఎమ్మెల్యే కోటాలో అందరు జర్నలిస్టుల కంటే రెండిళ్లు ఎక్కువ తీసుకున్న రోజే వీడిపై తోటి జర్నలిస్టుల్లో విలువ తగ్గిపోయిందట. ప్రతీ చిన్న అవసరానికీ మండల, డివిజనల్ స్థాయి అధికారులపై వాలిపోయే వీడిలాంటి వాళ్లు సమాజానికి చీడపురుగులే!

బ్లాక్ మెయిల్ బాడుకోవు!

వీడిని వర్ణించడానికి ఇంతకన్నా మంచి పేరు దొరకలేదు. జర్నలిస్టు ముసుగులో శ్రీకాకుళం జిల్లాలో వీడు సాగిస్తున్న అరాచకాలకు వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. కంత్రీ సతీష్ గా స్థానికంగా పేరుమోసిన వీడి అసలు పేరు కోనె సతీష్ కుమార్. జిల్లా జర్నలిస్టులకే కాకుండా పక్క జిల్లాల వారికి కూడా తలనొప్పిగా తయారైన వీడి లీలలపై ప్రత్యేక కథనం...

వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం అక్రమాలపై సభ్యుల ఆందోళన

వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరంలో జరుగుతున్న అక్రమాలపై సభ్య జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో సభ్యులు పాలకవర్గ అవినీతిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా నిధుల దుర్వినియోగం, కనీసం సభ్యులకు ముందుగా తెలియజేయకుండా పెద్ద మొత్తంలో ఖర్చులు చేయడం వంటి వాటిపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక వర్గం, సభ్యుల క్షమాపణ కోరిన వరకు విషయం వెళ్లడం గమనార్హం. సుదీర్ఘకాలం పాటు పదవుల్లో కొనసాగిన ప్రస్తుత పాలక వర్గాన్ని మళ్లీ పోటీ చేయకుండా నిలువరించాలని మెజారిటీ సభ్యులు చేసిన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో తెలియదుకానీ, మొత్తానికి వి.జె.ఎఫ్.లో అక్రమాలు మాత్రం నిజమని తేలింది. (పూర్తి వ్యాసం కోసం క్లిక్ చేయండి)